టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
నంద్యాల బై ఎలక్షన్ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ నేతలు చల్లా మధుసూధన్రెడ్డి, ఉమా మల్లేశ్వరరావులు ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిశారు. నంద్యాల బై ఎలక్షన్ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఆయనతో చర్చించారు.నంద్యాలలో టీడీపీ భారీ అక్రమాలకు పాల్పడుతోందని కంప్లైంట్ చేశారు. టీడీపీ ఎలాగైనా గెలిచేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అలాగే కొత్త ఓట్ల కోసం పెద్ద ఎత్తున లేని ఓట్లను సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
జనవరి 1నుంచి జులై 28 వరకూ సుమారు 16వేల కొత్త ఓట్ల కోసం టీడీపీ నేతలు దరఖాస్తు చేశారని ఫిర్యాదు చేశారు. దరఖాస్తులన్నీ ఒకే ఐపీ అడ్రస్ నుంచి జరిగాయన్నారు. వీటన్నింటినీ వెరిఫికేషన్ జరిపించాలని కోరారు. కేవలం అర్హులకు మాత్రమే కొత్త ఓటరుకార్డులు జారీ చేయాలని ఈసీని కోరారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.