ఎండలో నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపిన రేవంత్, సండ్ర వెంకట వీరయ్య..
తెలంగాణ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే వీరు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న టైమ్ లో వీరిద్దరూ అసెంబ్లీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. తర్వాత ఇద్దరూ ఎండలో కాసేపు నిలబడ్డారు. ఇలా వినూత్న రీతిలో నిరసను వ్యక్తం చేశారు. ఇదికాస్తా మీడియా కంటికి చిక్కింది.
తమను సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని అన్నారు. అయినా కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని తమపై నెపం వేశారని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తమ వాయిస్ వినిపించకూడదనే ఇలా చేశారని ఆరోపించారు.తమ సస్పెన్షన్ పై గవర్నర్ కు వివరిస్తామని అన్నారు. గవర్నర్ ను గురువారం రోజున కలుస్తామని చెప్పారు.ఇక ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన తెలపాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఖమ్మంలో జరిగే నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి పాల్గొనబొతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.