నేటి నుంచి మహానాడు ప్రారంభం
తిరుపతి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 27 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న ఈ మహానేడు కార్యక్రమానికి తిరుపతిలో మున్సిపల్ మైదానం వేదికైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహానాడు కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి నగరం పసుపుమయం అయింది. మహానాడు వేడుకలను విజయవంతం చేయడానికి గత వారం, పది రోజుల నుంచి పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు స్థానికంగా మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహానాడు వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల నుంచి 30 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాగా మహానాడుకు హాజరయే ప్రతినిధులకు ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేందుకు ఏపీలను కూలర్లను ఏర్పాటు చేశారు.
అయితే మహానాడు కార్యక్రమానికి భారీ భద్రతను రాష్ట్ర పోలీసులు కల్పిస్తున్నారు. రాయలసీమ రెంజ్ డీఐజీ ప్రభాకర్రావు పర్యవేక్షణలో, చిత్తూరు జిల్లా ఎస్పీ జయలక్ష్మి నేతృత్వంలో 3,500 మంది సిబ్బందితో భద్రతాచర్యలు చేపట్టారు. బందోబస్తులో ఐదు జిల్లాల ఎస్పీలు, 33 మంది డీఎస్పీలు, ఆరుగురు మహిళా డీఎస్పీలు, 103 మంది సీఐలు, 520 మంది ఎస్ఐలు విధుల్లో పాల్గొననున్నారు. కాగా ఈ మహానాడులో మొత్తం 28 తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నట్లు టీడీపీ ముఖ్యనేతలు పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.