నిజాం షుగర్స్ ఎప్పుడు తెరిపిస్తారో క్లారిటి ఇవ్వాలన్న రేవంత్..
కరవు అంశంపై తెలంగాణ శాసన సభలో వాడీ వేడీ చర్చ సాగింది. ఇందులో భాగంగా టీడీఎల్పీనేత రేవంత్రెడ్డి మాట్లాడారు. నిజా షుగర్స్ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయిందన్నారు. అయినా ఇంత వరకు నిజాం షుగర్స్ను తెరిపించలేదని శాసన సభ దృష్టికి తీసుకువచ్చారు. నిజాం షుగర్స్ను ఎప్పటిలోగా తెరిపిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోందన్నారు. రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సర్కారుకి ఒక ప్రణాళిక ఉండాలన్నారు. గత పాలకుల విధానాలనే ప్రస్తుత సర్కారు కూడా అమలు చేస్తున్నట్లుందని విమర్శలు గుప్పించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.