టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం..?
టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబం తరతరాలుగా రవాణా రంగంలో కొనసాగుతోంది. అయితే కేశినేని నాని ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రవాణారంగానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారు.ఈ విషయం చెప్పేందుకు ఆయన మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావించారని సమాచారం. కేశినేని ట్రావెల్స్ సంస్థను నాని తాత కేశినేని వెంకయ్య ప్రారంభించారు. అప్పటి నుంచి వారి వ్యాపారం కొనసాగుతూ వస్తోంది.ఇక నాని తీసుకోబోతున్న నిర్ణయం గురించి ఏపీ సీఎం చంద్రబాబుకు సమాచారం అందింది. దీంతో ఆయన తనను కలవాల్సిందిగా నానికి సూచించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు.
ఇక నాని మీడియా సమావేశంలో అసలు రవాణా రంగం నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వస్తోందో చెప్పాలని భావించారని సమాచారం. ఈ మధ్యే ఆర్టీఏ అధికారులతో కేశినేని నానికి వివాదం రేగిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీఏ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాని ఆర్టీఏ అధికారులకు క్షమాపణలు కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ తనకు పార్టీయే ప్రధానం అని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన రవాణా రంగానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించినట్లుగా సమాచారం. అయితే చంద్రబాబు పిలుపు మేరకు ఆయన్ను కలిసేందుకు వెళ్ళారు. మరి నాని తన నిర్ణయం మార్చుకుంటారా అన్నది తెలియాలంటే కాస్తంత వేచి చూడాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.