2050వరకు టీడీపీదే అధికారమట!
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్న టీడీపీ వచ్చే ఎలా గెలవాలని ఆలోచనలు చేస్తుంటే ఒక మంత్రి మాత్రం టీడీపీ 2050 వరకు అధికారంలోనే ఉంటుందని జోష్యం చెప్పారు. అంతేకాదు మరోపార్టీ తమపార్టీ దరిదాపుల్లోకి కూడా రాలేదంటున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్దాం. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు 2050 వరకు టీడీపీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మరో 34 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంటుందన్నది అచ్చెన్నాయుడి లెక్క. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మాట ఆయన చెప్పగానే అక్కడున్నవారంతా పగలబడి నవ్వారట.. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినా గడచిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తమ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని ఈ కారణంగానే తమ పార్టీ 2050 దాకా అధికారంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే వరుసగా రెండు టెర్ములు అధికారంలోకి రావడమే కష్టంగా మారుతున్న కాలంలో 35 ఏళ్ల పాటు అధికారం నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదన్నది అందరికీ తెలిసిందే.
దేశంలో ప్రస్తుతం సుదీర్ఘకాలంగా అప్రతిహతంగా సాగుతున్న పాలన ఒడిశాలోని నవీన్ పట్నాయిక్ ది – త్రిపురలో మాణిక్ సర్కార్ ది మాత్రమే. మాణిక్ సర్కారు 18 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతుండగా నవీన్ 16 సంవత్సారాలుగా ఆ పోస్టులో ఉన్నారు. ఇటీవల అస్సాంలోనూ మూడు టెర్ముల తరుణ్ గొగోయ్ పాలన ముగిసింది. చివరకు చాలాకాలంగా గుజరాత్ లో పాలన సాగిస్తున్న బీజేపీ కూడా అక్కడ 2001 నుంచే వరుసగా అధికారంలో ఉంది. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో 2050 వరకు తమదే అధికారం అనుకోవడం భ్రమ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.