దుమ్మెత్తి పోసుకున్న అధికార విపక్ష సభ్యులు..
నిన్నటి వరకు లోకేష్ ఆస్తులపై విపక్షం రభస చేసింది. ఇక అసెంబ్లీలో జగన్ ఆస్తులపై అధికార పక్షం విమర్శలు గుప్పించింది. జగన్ ఆస్తులపై ఇరు పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి కుక్క తోక వంకర అంటూ మాట్లాడారు. దీంతో అసెంబ్లీలో పెద్ద ఎత్తున రభస చోటు చేసుకుంది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి విమర్శలు చేశారు. బురదలో దొర్లిన పందుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతర వ్యక్తం చేశారు.
దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కల్పించుకున్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసుకోవడం సబబు కాదని అన్నారు. తక్షణ వాటిని వెనక్కు తీసుకోవాలని అన్నారు. దీంతో నాని స్పందించారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తమను కుక్క తోక వంకర అంటూ మాట్లాడారని అన్నారు. అందుకే బురదలో దొర్లిన పందుల్లా అంటూ వ్యవరిస్తున్నారని అన్నానని చెప్పారు. ఈ విషయంలో బుచ్చయ్య చౌదరి బాధపడి ఉంటే తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటానని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.