అసంతృప్తిలో టీమిండియా ఆటగాళ్లు
టీమిండియ ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు. బోర్డు నిర్ణయంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మినీ ఐపీఎల్, దులీప్ ట్రోఫీని ఏకకాలంలో నిర్ణయించాలని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయడంతో అసలు సమస్య మొదలైంది. సరైన ప్రణాళికలు లేకుండా బోర్డు వ్యవహరిస్తోందని, ఏ టోర్నమెంట్లలో పాల్గొనాలో అర్థంకావడం లేదని ఆటగాళ్లు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఆటగాళ్లు తమకు ఉన్న ఒప్పందాల కారణంగా ఆయా జట్లకు కొనసాగాల్సి ఉంటుంది.
కానీ, బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు ఏకకాలంలో ఉంటే కాంట్రాక్టుల పరిస్థితి ఏంటని ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కనీసం నెల రోజుల ముందు తమకు ఈ విషయాన్ని తెలపాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ పరిస్థితి నుంచి బయటపేడే మార్గాలు అన్వేషిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.