తెలంగాణలో కూడా బీజేపీ పుంజుకుంటుంది: దత్తాత్రేయ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. ముఖ్యంగా యూపీలో భారీ విజయం నమోదు చేసింది, దీంతో తెలంగాణలోని ఆ పార్టీ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బీజేపీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ పార్టీ క్యాడర్ కి నూతన ఉత్తేజం వచ్చింది. ఇక తెలంగాణలో కూడా పార్టీ గెలుపుపై సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే రోజులలో తెలంగాణలో కూడా బీజేపీకి ఇలాంటి ఫలితాలు వస్తాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. వారికి జనమే గుణపాఠం చెప్పారని అన్నారు. యావత్ భారత్ లో మోదీ హవా నడుస్తోందని అన్నారు.చిన్న చిన్న గ్రామాల్లో కూడా జనం మోదీకి మద్దతు తెలిపారని అన్నారు. మహిళలు, దళితులు అత్యంత శక్తివంతంగా మారాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని ఆకాంక్షించారు.కేంద్ర చేపట్టిన పథకాలను జనంలోకి బాగా తీసుకెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.