హరిత హారం`.. కదిలిన తారాగణం: పర్యావరణం అత్యంత ప్రమాదకర స్థితిలోకి వెళ్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం `హరిత హారం` పేరుతో ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం.. సెలబ్రెటీలు దానికి మంచి ప్రచారం కల్పించడం మంచి పరిణామమే. తెలుగు పరిశ్రమకు చెందిన నటీనటుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పేరున్న తారలు చాలామంది పబ్లిక్ లోకి వచ్చి మొక్కలు నాటే మంచి కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. దగ్గుబాటి రానా.. ఇలా చాలామంది తమ వ్యక్తిగతంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘హరితహారం’లో పాల్గొన్నారు. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన మంచి కార్యక్రమంలో ఇంతమంది ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొనడం మంచి విషయమే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.