జవాన్లపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు..
ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. భారత ఆర్మీ టార్గెట్ గా కాల్పులకు తెగబడ్డారు. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. జవాన్లపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యధావిధిగా బీఎస్ ఎఫ్ జవాన్ల కాన్వాయ్ నిర్వహించింది.
అదే సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జవాన్లపై కాల్పులు జరిపారు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం అయ్యాడు. స్థానికంగా ఉన్న మహిళ మృతి చెందింది. ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు విస్తృత గాలింపులు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.