కేసీఆర్ చేసే తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదు: కిషన్ రెడ్డి
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు.తప్పుడు ప్రచారాలు చేసినందుకు అమిత్ షా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతినే దెబ్బతీస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు చేయాల్సిన పనులు కావని అన్నారు. తాను చెప్పింది తప్పని అమిత్ షా రుజువు చేయగలిగితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని అన్న విషయం తెలిసిందే.
ఈ అంశంలో తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసే తాటాకు చప్పుళ్ళకు బీజేపీ భయపడదని అన్నారు. ఆయన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు. దళితుడి సీట్లో ముఖ్యమంత్రిగా కూర్చున్న కేసీఆర్ వారిని అవమానించారని అన్నారు. ఢిల్లీలో ఉన్నది మన్మోమన్ సింగ్ సర్కారు కాదని మోదీ సర్కారు అని అన్నారు. తెలంగాణ సాధన కోసం వారు ఎంత పోరాటం చేశారో దానికి పదింతలు తాము కూడా పోరాటం చేశామని అన్నారు. అప్పట్లో మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో , ఢిల్లీలో ధర్నా చేపట్టామని అన్నారు. మరి అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కు బీజేపీని విమర్శించే హక్కు లేదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.