ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘ది మహా భారత’
‘ది మహాభారత’ చిత్రాన్ని యాడ్ ఫిలిమ్స్ రూపకర్త వి.ఎ.శ్రీకుమార్ మేనన్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ కోసం యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏకంగా వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టనున్నారట. ఈ చిత్రాన్ని రెండు పార్ట్ ల కింది తెరకెక్కించనున్నారు. మొట్టమొదటగా ఈ మూవీని ఇంగ్లీష్, హిందీ, మలయాళం,కన్నడం, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నారు. అనంతరం ఏకంగా వంద విదేశీ భాషల్లోకి అనువాదం చేయనున్నారు.
ఇక ఈ చిత్రం కోసం యాక్టర్స్ ని అన్ని భాషల నుంచి ఎంపిక చేయనున్నాట్లుగా తెలుస్తోంది. యాక్టర్స్ ని ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎంపిక చేయనున్నారని టాక్.ఈ చిత్రాన్ని ప్రముఖ రైటర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ రాసిన రాందమూళం అనే నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రంలో అత్యధిక భాగం భీముడు గురించే ఉంటుందట. 2018లో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారట. రెండేళ్ళ పాటు షూటింగ్ జరుపుకుని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారని టాక్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.