త్రిషా కూడా ఆ సరదా తీర్చుకుంటుంది..!
సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో త్రిషా కూడా ఒకరు. 15 ఏళ్లుగా వెండితెర మీద వెలుగులు చిందిస్తున్న ఈ అమ్మడు మధ్యలో కెరియర్ ముగించి పెళ్లి చేసుకుందామని అనుకున్నా కాలం కలిసి రాలేదు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష తెలుగులో మాత్రం దాదాపు కెరియర్ ముగించేసింది. అడపాదడపా అవకాశాలు వస్తున్నా అవి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పూర్తిగా తమిళ సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు అమ్మడు కెరియర్ లో కొత్త టర్న్ తీసుకోనుందట.
ఇన్నాళ్లు హీరోయిన్ గా అలరించిన త్రిష నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగిన ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిందట. మొదటి సినిమా తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ చేయబోతుందని తెలుస్తుంది. త్రిష నిర్మాతగా ఆమే లీడ్ రోల్ లోనే ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే బాలీవుడ్ లో అనుష్క శర్మ హీరోయిన్ గా చేస్తూనే ఓన్ ప్రొడక్షన్ ను నడుపుతుంది. ఈ క్రమంలో త్రిష కూడా అదే తరహాలో నిర్మాతగా కూడా కెరియర్ సక్సెస్ చేసుకోవాలని ఆరాటపడుతుంది. మరి ఆమె ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.