సీఎం కేసీఆర్ రైతుల సమస్యలు గాలికొదిలేశారు: జగ్గారెడ్డి
తెలంగాణలో రైతులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. అయితే సీఎం కేసీఆర్ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఆయన మాత్రం పార్టీ ప్లీనరీని పండుగలా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చినా రైతులకు ఏమీ చేయలేదని అన్నారు.
అయితే తెలంగాణలో రైతులే రాజులు అంటూ కబుర్లు చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ ఉత్తుత్తి కబుర్లు కట్టిపెట్టాలని సూచించారు. తక్షణం రైతు సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. కేవలం రైతుల ఓట్ల కోసమే కేసీఆర్ వారిపై ప్రేమ కురిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇవన్నీ కేసీఆర్ కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.