విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ సీతారామ్ నాయక్..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పెద్దగా పోరాడింది ఏమీ లేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారామ్ నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రం కోసం పోరాటం చేయకుండా అమ్ముపోయారని విమర్శించారు. దీనివల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అయిందన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలనే పణంగా పెట్టారని అన్నారు. అలాంటి వ్యక్తి చేసిన దీక్షపై జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు. అయితే విపక్ష పార్టీలు టీజేఏసీ ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఇప్పటికే 5936 పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు. త్వరలో మరో 11 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. త్వరలో దీనికి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామన్నారు. ప్రైవేట్ సెక్టార్ 44 వేల మేర ఉద్యోగాలను కల్పించామన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.