కుర్రాళ్ళు కొట్టేశారు.. వరల్డ్ కప్ అందుకున్న భారత యువ జట్టు..!
అనుకున్నట్టుగానే దేశం గర్వించేలా కుర్రాళ్లు ప్రపంచకప్ కైవసం చేసుకున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో పోటీపడిన భారత యువ జట్టు విజయ దుంధుంభి మోగించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక ఇషాన్ పోరెల్, శివ సింగ్, నగర్కోటి, అంకుల్ రాయ్ 2 వికెట్లు చొప్పున తీశారు.
ఇక 217 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యువ జట్టు 38.5 ఓవర్లకే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ పృధ్వి షా 29 అవుట్ అవగా.. మరో ఓపెనర్ కల్రా 101 పరుగులతో నాటౌట్ గా ఉండి భారత్ కు విజయాన్ని అందించారు. హార్విక్ దేశాయ్ కూడా 47పరుగులతో నాటౌట్ గా ఉండి జట్టుకి విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో ఇండియా అండర్ 19లో 4 సార్లు వరల్డ్ కప్ అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.