కీలక నేతగా ఎదుగుతున్న సీఎం యోగి..
యూపీ సీఎం యోగి తీసుకుంటున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చలు సాగుతున్నాయి. ఆయన యూపీని వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జనంలో ఆయన బాగా పాపులర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కూడా ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీ అధిష్టానం ప్రమోషన్ ఇచ్చింది.
బీజేపీకి ఓ రకంగా గుజరాత్ వల్లే అధికారం వచ్చింది. అభివృద్ధికి ఆ రాష్ట్రాన్నే సింబల్ గా చూపించింది బీజేపీ. అలాంటి రాష్ట్రంలో ఎన్నికలు అంటే బీజేపీకి ప్రతిష్టాత్మకమైనవే కదా. అందుకే అక్కడ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి రెడీ అవుతోందని బీజేపీ. ఇందులో భాగంగా అక్కడ 150 స్థానాల్లో క్లీన్ స్విప్ చేసేందుకు భారీ స్కెచ్ రెడీ చేస్తోందని రాజకీయ వర్గాల సమాచారం.ఇక గుజరాత్ ఎన్నికల భారాన్ని బీజేపీ హై కమాండ్ యోగిపై పెట్టింది. అక్కడ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా యూపీ సీఎం యోగి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ మేరక బీజపీ పార్టీ శ్రేణుల్లో చర్చలు సాగుతున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.