యూపీకి అదనంగా పది ఐఏఎస్ లను పంపాలని మోదీని కోరిన సీఎం యోగి..
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.ఈ మధ్యే ఏకంగా భారీ ఎత్తున ఐపీఎస్, ఐఏఎస్ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి మరికొందరు అధికారులు కావాలని ప్రధాని మోదీని కోరారు. దీనిపై మోదీ సానుకూలంగా స్పందించారు.
యూపీలో సీనియర్ అధికారుల కొరత ఉందని తెలిపారు. మరో 10 మంది సీనియర్లను యూపీకి పంపాలని ప్రధాని మోదీని కోరారు. అయితే తక్షణం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ లను యూపీకి పంపించారు. మిగిలిన ఐదుమందిని త్వరలోనే కేటాయించనున్నారని సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.