అఖిల్-శ్రీయలను ఉపాసన కలుపుతుందా..?
అక్కినేని అఖిల్, శ్రీయభూపాల్ పెళ్ళిని మే నెలలో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిశ్చయించారు. అయితే ఈ మధ్య వీరిద్దరి వివాహం క్యాన్సిల్ అయిందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి బ్రేకప్ అయిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో నాగార్జున బాగా డిస్ట్రర్బ్ అయ్యారని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నా కూడా ఈ అంశంలో ఇరు కుటుంబాల నుంచి ఎవరు నోరు మెదపలేదు.
తాజాగా వీరి వ్యవహారం గురించి మరో ప్రచారం వినిపిస్తోంది. అఖిల్, శ్రీయల మధ్య విభేదాలను తొలగించేందుకు రామ్చరణ్ భార్య ఉపాసనను రంగంలోకి దించినట్లుగా ప్రచార సారాంశం. జీవీకే కుటుంబానికి ఉపాసన ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి.అంతేకాకుండా శ్రీయకు, ఉపాసన మంచి ఫ్రెండ్. అందుకే అఖిల్, శ్రీయల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉపాసన ప్రయత్నిస్తోందట. ఉపాసన ప్రయత్నాలు ఫలించి అఖిల్, శ్రీయ ఒక్కటవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.