యూపీలో ఉగ్రకలకలం..
ఎన్నికల వేళ యూపీలో ఉగ్రకలకలం రేగింది. లక్ నవూ శివార్లలో ఠాకూర్ గంజ్ ఏరియాలో ఉగ్రవాది దాక్కున్నట్లుగా పోలీసులకు సమాచాం అందింది. హుటాహటినా ఆ ప్రాంతాన్ని పోలీసులు చేరుకున్నారు. ఉగ్రవాది దాగి ఉన్న ఇంటి చుట్టూ ఏటీఎస్, పోలీసులు మోహరించారు. దీంతో ఉగ్రవాది పోలీసులపైకి కాల్పుల జరిపినట్లుగా సమాచారం. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఉగ్రవాది దాగి ఉన్న ప్రాంతం గురించి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు యూపీ పోలీసులకు సమాచారం అందించాయి.దీంతో రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపుగా 20 కమెండోలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని సమాచారం. అయితే ఉగ్రవాది దాక్కున్న ఇంట్లో ఒకరు కంటే ఎక్కువ మంది ఉన్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఈ ఉగ్రవాదికి మధ్యప్రదేశ్ లో జరిగిన రైలు పేలుడు ఘటనతో సంబంధం ఉందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.