ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై వచ్చే వారం విచారణ..
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై వచ్చే వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ యు.యు. లలిత్లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై తమ అభిప్రాయన్ని వెల్లడించింది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అయితే.. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ ఇప్పటికే ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ స్పందించింది. రాష్ట్రపతి పాలనపై స్టే విధించింది. మార్చి 31న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్కు సూచించింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.