వాటి గురించి మీకెందుకు?
ప్రముఖ వ్యాపార వేత్త విజయ్మాల్యా బ్యాంకర్లకు.. పోలీసులకు.. కోర్టులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంత ఒత్తిడి చేసినా మాల్యా భయపడడం లేదు. విదేశాల పౌరసత్వం కలిగిన తాము మీరు అడిగేటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదని దబాయిస్తున్నాడు. తాజాగా బ్యాంకర్లకు మరో ట్విస్ట్ ఇచ్చాడు. సుప్రీంకోర్టులో గురువారం అఫిడవిట్ దాఖలు చేశారు. విదేశాల్లోని తన ఆస్తుల సమాచారాన్ని అడిగే హక్కు బ్యాంకులకు లేదని ఆ అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. భారత్, విదేశాల్లో మాల్యా, ఆయన కుటుంబ సభ్యులకున్న ఆస్తుల వివరాలను ఏప్రిల్ 21లోగా వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఆ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మాల్యా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
తాను ఎన్ఆర్ఐననీ, అందువల్ల విదేశీ ఆస్తులను తాను వెల్లడించదలచుకోలేదని అన్నారు. తన ముగ్గురు పిల్లలు, భార్య అంతా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారని, వారు కూడా తమ విదేశీ ఆస్తులు వెల్లిడించాల్సిన అవసరం లేదని అన్నారు. రుణాలు మంజూరు చేసే సమయంలో విదేశీ ఆస్తులను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. మాల్యా 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడ్డారు. ఇంతకీ విజయ్ మాల్యా విదేశాల నుంచి తిరిగి వస్తాడా? బ్యాంకర్లకు బకాయి ఉన్న ఆ డబ్బును చెల్లిస్తాడా? లేదా? అన్నది మరికొంత కాలం వేచి చూడక పత్పదు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.