కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్-2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా వ్యవహరించనున్నారు. గత ఏడాది క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు.అయితే ఆయన ఆటతో మాత్రం అనుబంధాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. ఇక ఈ ఏడాది నుంచి జట్టు కోచ్ సంజయ్ భంగర్కు సెహ్వాగ్ హెల్పర్ గా ఉండబోతున్నారు. ఈ నియామకంపై భంగర్ స్పందించారు. సెహ్వాగ్ గత రెండు సీజన్లలో తన బ్యాటింగ్తో జట్టులో స్ఫూర్తి నింపాడని అన్నారు. ప్రస్తుతం సెహ్వాగ్ సలహాలతో పంజాబ్ మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రీతిజింతా సహ యజమానిగా ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.