అందుకే జగన్ ను టార్గెట్ చేయాల్సి వస్తోందట..
ప్రతి అంశంలో తమ అధ్యక్షుడు జగన్ ను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్షంగా ఉందని అన్నారు. జగన్ పార్టీ తరపున ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూ ఉంటారని అన్నారు. ఈ నేపథ్యంలో అన్నింటికి ఆయనకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గాని వామపక్షాలు గాని లేవని అన్నారు. అందువల్ల సభలో ఉన్న విపక్షం అయిన వైసీపీ గురించి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. అందువల్ల జగన్ నే టార్గెట్ చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. జగన్ అంటే టీడీపీకి భయం అని అందుకే టార్గెట్ చేస్తున్నారని చేస్తున్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.
సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. చిన్న కేసులో నాలుగేళ్ళ పాటు శిక్షను శశికళ అనుభవిస్తోందని అన్నారు. చాలా కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నారని అన్నారు. దీన్నిబట్టి చూస్తే జగన్ కు వందేళ్లకు పైగా శిక్ష పడుతుందని చెప్పారు. ఈ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కేశినేని నాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.