మరో పిచ్చి సాహసం…అవసరమా?
తొమ్మిది మంది బాలలు…
వంతెనపై వరసగా నిలుచున్నారు…
కింద వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది…
అంతలో రైలు హారన్…
భీకరమైన వేగంతో దూసుకువచ్చింది…
అంతే..ఒకరి తరువాత ఒకరుగా తొమ్మిది మంది నదిలోకి జంప్ చేశారు…
ఏమాత్రం అంచనాలు తప్పినా గాలిలో కలసిపోయే ప్రాణాలు…
రైలు కన్నా ముందు వచ్చే గాలి ఒత్తిడి తగిలినా ఎగిరి పడతారు…
కానీ..బాగా శిక్షణ పొందిన స్టంట్స్ మెన్స్ లా చక్కటి టైమింగ్ తో దూకేశారు…
అయితే ఈ సాహసం దేనికోసం?
ఎవరికి కడుపుకోత మిగిలిద్దామని?
అవసరమా?
ఈ సంఘటన ఘాజియాబాద్ వద్ద జరిగింది…
పోలీసులు వీరికోసం గాలింపులు మొదలుపెట్టారు…
దొరికితే వాయగొట్టడం పది సంవత్సరాల జైలుశిక్ష ఖాయం…
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.