ప్రజా సమస్యలపై సర్కారుతో పోరాటం చేస్తాం: కోదండరామ్
ప్రజా సమస్యలను పరిష్కారం కోసం జేఏసీ పోరాటం చేస్తుందని కోదండరామ్ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో పోరాడే దమ్ము తమకుందని అన్నారు. తనపై జేఏసీ నేతలు చేసిన విమర్శలపై తానేమీ స్పందించనని అన్నారు. స్టీరింగ్ కమిటీ భేటీలోని వీటిని చర్చిస్తామన్నారు. సంగారెడ్డి ఇస్లామిక్ స్టడీ సెంటర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ముస్లీంల స్థితి గతులకు సుధీర్ కమిటీ ఇచ్చి నివేదిక తెలియజేస్తోందని అన్నారు. ముస్లీంలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచాలని సిఫార్సుల అమలుకు కృషి చేస్తామన్నారు. ఉర్ధూను రెండవ బాషగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఉద్యోగాల్లో వివక్షను తొలగించేందుకు సమాన అవకాశాల కమిటీ వేయాలి కోదండరామ్ డిమాండ్ చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.