ఈవీఎంల ట్యాంపరింగ్ పై కోర్టును ఆశ్రయిస్తాం: బీఎస్పీ చీఫ్ మాయావతి
యూపీ ఎన్నికల్లో బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. దీంతో గతంలో కాంగ్రెస్ సాధించిన రికార్డును కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఏకంగా ఆ పార్టీకి 300పైగా స్థానాలు వచ్చాయి. ఇక మిత్ర పక్షాలతో కలిసి బీజేపీ కూటమి 325 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. ఇక ఎస్పీ రెండవ స్థానంలో నిలిచింది. మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీకి ఘోర పరాజయం మిగిలింది. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి మాయావతి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపణలు గుప్పించారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కొట్టిపారేసింది.
అయితే మాయావతి మాత్రం ఈ విషయం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని తను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఈ అంశంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.మాయావతి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.