తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో జనహిత కార్యక్రమం సందర్భంగా రైతులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. అంతేకాదు ఈ సమావేశం సందర్భంగా సంచలన నిర్ణయం ప్రకటించారు. రైతులతో మాట్లాడుతూ.. తాను ఇవాళ చెప్పేంది పెద్ద చరిత్ర అవుతుందని అన్నారు. దేశం మొత్తం దీనిగురించే మాట్లాడుకుంటుంది అని అన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రైతులు వాడేటువంటి 24 లక్షల టన్నుల ఎరువులను పూర్తిగా ఉచితంగా అందిస్తామని చెప్పారు. రూ. 17 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ సర్కారుది అని అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపైనే పూర్తిగా దృష్టిపెట్టామని అన్నారు. 21 శాతం మేర ఆదాయం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. 55 లక్షల మంది రైతులకు పూర్తి ఉచితంగా ఎరువులు అందిస్తామని ప్రకటించారు. అయితే పురుగు మందులు, విత్తనాలు మాత్రం రైతులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఎరువులను సరఫరా చేసేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని చెప్పారు.అలాగే తెలంగాణలో కోటి ఎకరాలకు నీటిని అందించి తీరుతామని ప్రకటించారు. సీఎం తన నిర్ణయం ప్రకటించగానే రైతులు అందరూ లేచి నిలబడి నినాదాలు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.