శశికళ అంత జరిమానా కట్టగలరా..?
చెన్నైలో ఓ దర్యాప్తు సంస్థ సహాయంతో జయలలిత కేసుకు సంబంధించిన జరిమానా మొత్తాన్ని రాబట్టేందుకు కర్నాటక సర్కారు ప్రయత్నిస్తోంది. ఎలాగైన సొమ్మును రికవరీ చేయాలని భావిస్తోంది. అయితే జయ లలిత మృతి చెందారు. ఇక శశికళ అయితే జైలు జీవితం గడుపుతున్నారు. మరి కోర్టు విధించిన జరిమానాను ఎవరు కడతారు..? అదీ గడువులోపల కట్టే అవకాశం ఉందా..?
ఒకవేళ గడువు లోపు జరిమానా చెల్లించలేకపోతే శశికళకు మరో 13 నెలల జైలు శిక్ష తప్పేట్లు లేదు. దీంతో ఈ జరిమానా మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు అన్నది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. కోర్టు విధించిన జరిమానాను కట్టాలంటే.. ఆ సొమ్ము చట్టబద్ధమైనదై ఉండాలి. అయితే 110 కోట్ల వైట్ మనీ శశికళ దగ్గర ఉందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఒకవేళ లేనిపక్షంలో అన్నాడీఎంకే పార్టీ నిధుల నుంచి కట్టాల్సి ఉంటుంది. దీనికి పార్టీ నేతలు ఒప్పుకుంటారా అన్నది పెద్ద సమస్య. ఆ సొమ్మును చెల్లించినప్పటికీ అదికాస్తా ముందు కర్నాటక సర్కారుకు చేరుతుంది. ఆ తర్వాతే తమిళనాడుకు వస్తుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.