టీమిండియాకు భారీ షాక్..
టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత క్రికెటర్లు తడబడ్డారు.ఈ మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 18.1 ఓవర్లలోనే 79 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రోహిత్ శర్మ, ధావన్, రైనా, యువరాజ్, హార్దిక్ పాండ్య, జడేజా చాలా తక్కువ పరుగులకే అవుటయ్యారు. అయితే విరాట్ కోహ్లి, కెప్టెన్ ధోని మాత్రం ఫర్వాలేదనిపించారు. భారత్ తర్వాత మ్యాచ్ మార్చి 19న పాకిస్థాన్తో జరగనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.