జగన్ కూడా జైలు కెళ్లాల్సిందే.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
తమిళనాడు రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు ముడిపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడ శశికళ జైలుకెళ్ళారని అన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ 20 ఏళ్ళ తర్వాత జైలు కెళ్లారని చెప్పారు. అలాగే జగన్ కూడా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. రూ. 40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్ ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను టీడీపీ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అనుక్షణం వారి సంక్షేమమే నా ధ్యేయం అని పేర్కొన్నారు. పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలమవుతుందని చెప్పారు. శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందిస్తామని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఇది నెరవేరుతుందని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.