అసెంబ్లీలో అధికారాలన్నీ అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉండడం వలన పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన సభ్యుడే స్పీకర్గా ఉండడం వలన, పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకపోవడం వలన ఎమ్మెల్యేలే ధైర్యంగా అధికార పార్టీకి మారుతున్నారని పేర్కొన్నారు. బుధవారం ఓ టీవీ ఛానల్కు ఇంటర్వూ ఇస్తూ పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, అసెంబ్లీలో తమకు 67 మంది శాసనసభ్యులుఉంటే అందులో 13 మందిని ఎమ్మెల్యేలను కొనుగోలుచేశారని, అయినా ప్రభుత్వానికి ఒరిగేదేమీ ఉండదన్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకి రూ.20 నుంచి రూ.30 కోట్లు ఇస్తున్నారని, అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఆశ చూపుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడకు ఇంత అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో అనేదానిపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. చంద్రబాబు నాయుడు చేసే అవినీతి, అరాచకాలు, భూ దందాలు తదితర వాటిపై ముద్రించిన పుస్తంలో అన్నీ ఆధారాలతో సహా ఇచ్చామన్నారు. జీవోలతో పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో లక్షా 34 వేల కోట్లకు పైగా అవినీతి జరిగిందని జగన్ వివరించారు. ఇంత అవినీతి దేశంలో ఎక్కడా కూడా జరగలేదన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.