వైసీపీ ఎన్నికలకు రెడీగానే ఉంది: బొత్స సత్యనారాయణ
ఏపీలో ముందస్తు ఎన్నికల మాట చంద్రబాబు నోటివెంట వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగానే ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ కార్యాలయంలో తెలిపారు. తమ పార్టీ ఓట్ల శాతం తగ్గుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. అలా అయితే టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు.
ఇక జగన్ రైతుల సమస్యలపై దీక్ష చేపడతారని ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న జరగాల్సిన దీక్ష వాయిదా పడినట్లుగా ప్రకటించారు. ఈ దీక్ష వచ్చే నెల మొదటి తారీఖున జరుగుతుందని తెలిపారు. రైతులకు మద్దతు ధరలు లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అలాగే రుణ మాఫీ కాకపోడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల సమస్యలు నెరవేర్చకుడా సర్కారు కాలయాపన చేస్తోందని విమర్శించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.