లోకేష్ కామెడీ చూసి అలసిపోయాం.. ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు..
మంత్రిగా 20 రోజుల్లో నారా లోకేష్ చాలా కామెడీ చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆయన కామెడీని చూసి అలసిపోయామని అన్నారు.గుగూల్ లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు లోకేష్ ఫొటోలు కూడా వస్తున్నాయని ఆమె అన్నారు. ఓ రాష్ట్రమంత్రికి జయంతికి వర్ధంతికి తేడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వ్యక్తిని మంత్రి చేయడమేంటని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన బహిరంగ సభలో వైసీసీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
మీరు మంత్రి ఎందుకు అయ్యారని ప్రశ్నిస్తే తాగునీటి సమస్య సృష్టించడానికేనని చెబుతున్నారని అన్నారు. ఇలా మంత్రులు, ప్రభుత్వం చేసే తప్పులను సోషల్ మీడియాలో చూపిస్తామని అన్నారు. దీన్ని ఎవరు ఆపలేరని అన్నారు. టీడీపీకి 16 శాతం మేర ప్రజాదరణ ఎలా పెరిగిందో చంద్రబాబు నాయుడు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. జగన్ మాత్రమే రైతుల తరపున పోరాటం చేస్తున్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.