ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చర్యలకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్
ఎమ్మెల్సీ దీపక్రెడ్డి జేసీ బ్రదర్స్ అండతోనే భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణలు గుప్పించారు. సీబీఐ దాడులు తర్వాత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని అన్నారు. మరి దీపక్రెడ్డి కూడా అరెస్ట్ అయినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.వాకాటికి ఓ న్యాయం, దీపక్రెడ్డికి మరో న్యాయమా అంటూ నిలదీశారు.ఈ మేరకు పెద్దారెడ్డి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీపిక్ రెడ్డిపై తెలంగాణ సర్కారు సిట్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమండ్ చేశారు.
దీపిక్ రెడ్డి హైదరాబాద్ పరిసరాల్లో వందల కోట్ల విలువైన భూములను కబ్జా చేయాలని ప్రయత్నించారని అన్నారు. అందుకే ఆయన్ను హైదరాబాద్ సీసీఎస్ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు. వాకాటి నివాసంలో సీబీఐ సోదాలు జరిగిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. కాని దీపిక్ రెడ్డిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. దీంతో చంద్రబాబు వైఖరి ఏమిటో అందరికి తెలిసిందని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.