జగన్ పై కేసులను తక్షణం ఎత్తివేయాలి: వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్
ఏపీలో పాలన ప్రజాస్వాయ్య పద్ధతిలో సాగడం లేదని వైఎస్ ఆర్ సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం తాము నిరసనలు మాత్రమే తెలియజేశామన్నారు. ఈ మాత్రం దానికే తమపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వాయ్య దేశంలో నిరసనలు తెలియజేసే హక్కు అందరికి ఉంటుందని ఆయన అన్నారు. తమను పోలీసులు పశువుల మాదిరిగా ట్రీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపట్ల పోలీసులు చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆరోపించారు. తమను గురువారం రోజున రాత్రి 10 గంటల వరకు స్టేషన్ లోనే ఉంచారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం జగన్ సహా పలువురిపై కేసులు పెట్టించిందని ఆరోపించారు. తక్షణం తమపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తాము ఎలాంటి కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.