తెలుగు మాట్లాడటం రాని లోకేష్ మంత్రి పదవి: ఎమ్మెల్యే రోజా
తెలుగు భాషను సరిగా మాట్లాడటం కూడా నారా లోకేష్ కు రాదని ఎమ్మెల్యే రోజా అన్నారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇచ్చారని అన్నారు. లోకేష్ మంత్రి పదవి ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. తిరుమలలో మీడియా సమావేశంలో రోజా ఈ మేరకు వ్యాఖ్యానించారు. పనిలో పనిగా స్పీకర్ కోడెలపై కూడా విమర్శలు చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుకు అధికారం వచ్చినప్పుడల్లా రాష్ట్రంలో కరవు వస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రజలు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు డబ్బు, పదవులను ఆశచూపించి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. ఫిరాయంపు ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకోవడం దారుణం అని మండిపడ్డారు. కోట్లు ఖర్చు చేసి ఇళ్ళు కట్టుకున్న చంద్రబాబు నాయుడు పేదల కోసం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.