వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్ధులు దొరకరు: ప్రత్తిపాటి పుల్లారావు
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ను దోచుకున్నదే వైసీపీ నేతలేనని అన్నారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ చేస్తే శాసనసభలో వైసీపీ నేతలు పారిపోయారని వ్యాఖ్యానించారు. జనంలో టీడీపీకి ఉన్న ఆదరణను ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. అందువల్లే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.
నంద్యాల ప్రజలు వైసీపీ నేతలను తరిమికొట్టారని అన్నారు. వారు ఇప్పుడు కాకినాడ వస్తున్నారని అన్నారు. టీడీపీకి ఉన్న ఆదరణను చూసి జగన్ కు జ్వరం పట్టుకుందని అన్నారు. అందుకే ఆయన కాకినాడ ప్రచారానికి రాలేదన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబుతో పాటే ఉన్నారని అన్నారు. వైసీపీ అంతా అవినీతి పరులతో నిండిపోయిందన్నారు. ఆ పార్టీని జనం నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.