వైసీపీకి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఓడిపోతున్నారని అన్నారు. మొన్న విశాఖలో విజయమ్మ, నిన్న కడపలో వివేకానందరెడ్డి ఓటమి చెందారని అన్నారు. రోజా లాంటి వారిని అడ్డుపెట్టుకుని జగన్ చంద్రబాబు, లోకేష్ పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. జగన్ పులివెందుల సీటుకు రాజీనామా చేయాలని సవాల్ చేశారు. అలా అయితే తమ పార్టీ తరపు లోకేష్ పోటీ చేస్తారని అన్నారు.
నారా లోకేష్ ను అక్కడి నుంచి గెలిపించుకునే సత్తా తమకుందని అన్నారు. తాము చేసిన సవాల్ ను స్వీకరించేందుకు వైసీసీ రెడీగా ఉందా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.