జేసీపై కేసు నమోదుకు వైసీపీ డిమాండ్.. జేపీ ట్రావెల్స్ ముందు వైసీసీ నేతల నిరసన..
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. అంతేకాకుండా జేసీ ట్రావెల్స్ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. విపక్ష నేతను దూషించినందుకు జేపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీసీ నేతలు జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన అక్కడకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరారు. అయితే కేసు నమోదు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
కృష్ణా జిల్లా బస్సు యాక్సిడెంట్ విషయంలో ఓ పత్రిక తప్పుడు కథనాలు రాసిందంటూ జేపీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఆయన ఆ పత్రిక ఆఫీసు ముందు శనివారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో బలవంతంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారని రాజకీయ వర్గాల సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.